Header Banner

పాక్ హ్యాకర్ల ఫైల్ ట్రాప్! నకిలీ పత్రాలతో భారతీయులపై సైబర్ దాడులు!

  Thu May 01, 2025 17:40        India

భారత ఇంటర్నెట్ వినియోగదారులే లక్ష్యంగా పాకిస్థాన్ నుంచి సైబర్ దాడులు తీవ్రమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే ఈ దాడుల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. ముఖ్యంగా, అధికారిక పత్రాల రూపంలో నకిలీ పీడీఎఫ్ ఫైళ్లను పంపి, వాటి ద్వారా హానికరమైన మాల్‌వేర్‌ను చొప్పించి భారతీయుల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసేందుకు పాక్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు.
'పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన నివేదిక మరియు అప్‌డేట్' వంటి పేర్లతో నకిలీ పీడీఎఫ్‌లను పంపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇవి ప్రభుత్వ పత్రాల్లా కనిపించినా, వినియోగదారుల సమాచారాన్ని తస్కరించే ఫిషింగ్ డొమైన్‌లకు దారితీస్తాయి. వీటిని తెరిస్తే పరికరాలు హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ఏపీటీ36 (ట్రాన్స్‌పరెంట్ ట్రైబ్), సైడ్‌కాపీ వంటి పాకిస్థానీ హ్యాకర్ గ్రూపులు క్రిమ్సన్‌రాట్, కర్‌ల్‌బ్యాక్ రాట్ వంటి మాల్‌వేర్‌లను ఉపయోగించి రక్షణ, ప్రభుత్వ, కీలక మౌలిక సదుపాయాల రంగాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని క్విక్ హీల్ టెక్నాలజీస్, పీడబ్ల్యూసీ ఇండియా వంటి సంస్థల నిపుణులు తెలిపారు. ఈ దాడులు కేవలం సాంకేతిక అంతరాయాలే కాదని, వ్యూహాత్మక భౌగోళిక రాజకీయ ఎత్తుగడలని వారు విశ్లేషిస్తున్నారు. ఇవి భారత హ్యాకింగ్ గ్రూపుల దాడులకు ప్రతీకార చర్యలుగా కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలియని వారి నుంచి వచ్చే ఈమెయిళ్లు, అనుమానాస్పద పీడీఎఫ్ అటాచ్‌మెంట్లు, లింకుల పట్ల జాగ్రత్త వహించాలి... ఫైల్స్ తెరిచే ముందు వాటి ప్రామాణికతను ధృవీకరించుకోవాలి... ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి... అనుమానాస్పద వెబ్‌సైట్లు, ప్రకటనలపై క్లిక్ చేయవద్దు... అని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీంకోర్టులో విచారణ! పిటిషన్ తీరుపై తీవ్ర అసహనం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #CyberAttack #PakHackers #MalwareAlert #FakePDF #IndiaCyberSecurity #CyberThreat #DigitalSafety #HackingAlert